చెప్పినట్లే చేస్తున్న దాసరి

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందుగా సర్దార్ పాపా రాయుడు, బొబ్బిలి పులి లాంటి రాజకీయ సామాజిక నేపథ్యం వున్న సినిమాలు అందించిన దర్శకుడు దాసరి నారాయణ రావు త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి సినిమా ఇవ్వబోతున్నారని, ఇందుకోసం దర్శకుడు బోయపాటితో డిస్కషన్లు కూడా చేస్తున్నారని కొద్ది రోజుల క్రితమే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. 

ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఇందుకోసం దాసరి బోస్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీనికి సన్ ఆఫ్ ఇండియా అని టాగ్ లైన్ కూడా ఫిక్స్ చేసారట. ఇప్పుడు చేస్తున్న సినిమా కాక, హారిక హాసిని, ఎఎమ్ రత్నం, మైత్రీ మూవీస్ సినిమాల తరువాత దర్శకుడు దాసరికి కూడా పవన్ ఓ సినిమా చేయాల్సి వుంది. 

మరి ఆ సినిమా 2019లోపు పూర్తవుతుందా అన్నది చూడాలి. దాసరి అయితే టైటిల్ తో రెడీగా వున్నారు. బోయపాటి తో డిస్కషన్లు కొలిక్కి వచ్చి, పాయింట్ సెట్ అయితే స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుంది.

Show comments