నాగ్ కు కథలు చెప్పేస్తున్నారు

మనంతో నాగ్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అన్నీ హిట్ లే. సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, మంచి సినిమాలుగా నిలిచాయి. కొత్త కథలను, కొత్తవారిని నాగ్ విపరీతంగా ఎంకరేజ్ చేస్తాడు. ఓంకార్ లాంటి చిన్న డైరక్టర్ తో ఇప్పుడు పని చేస్తున్నాడు. చందు మొండేటితో తరువాతి సినిమా చేయబోతున్నాడు.

దీంతో యంగ్ డైరక్టర్లకు అందరికీ ఆశలు మరింత పెంచింది. ఇప్పుడు విరించి వర్మ, తిరుమల కిషోర్ లాంటి యంగ్ డైరక్టర్ లు ఇటీవలే నాగ్ ను కలిసి కథలు చెప్పేసారుట. ఇంకా మరో ఇద్దరు ముగ్గురు ప్రూవ్డ్ యంగ్ డైరక్టర్లు కూడా నాగ్ ను కలిసి లైన్లు వినిపించినట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన పాయింట్లు ఎవరి దగ్గర వున్నా నాగ్ సై అంటుండడం, అలాగే నాగ్ కు కాకుంటే, అఖిల్, చైతూ కూడా వుండడంతో, ఇప్పుడు నాగ్ అపాయింట్ మెంట్ కోసం క్యూ కడుతున్న డైరక్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే వుందట.

ఇది తనకు చాలా ఆనందంగా వుందని, తాను మాంచి ఫామ్ లో వున్నపుడు కూడా ఇన్ని కథలు, ఇంత వైవిధ్యమైన పాయింట్లు తన దగ్గరకు రాలేదని నాగ్ తన సన్నిహితులతో చెబుతున్నాడట.

Show comments