సాయిధరమ్ కే ఫిక్సయిన వినాయక్

మొత్తానికి తన తరువాతి సినిమా మీద దర్శకుడు వివి వినాయక్ ఫిక్సయిపోయారు. హీరో సాయిధరమ్ తేజ తోనే చేయాలని డిసైడ్ అయిపోయారు. నిర్మాతగా సి కళ్యాణ్ వ్యవహరిస్తారు. ఆయన ఇప్పటికే బాలయ్య-కేఎస్ రవికుమార్ తో ఓ ప్రాజెక్టు ప్రకటించారు. ఇది రెండో ప్రాజెక్టు. రెండూ సమాంతరంగా రెడీ చేస్తారు.

ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత సరైన సినిమా కోసం వినాయక్ వేచి చూసారు. కానీ ఏ హీరో కూడా ఖాళీ లేరు. పెద్ద హీరోల డేట్లు దొరకాలంటే కనీసం ఏడాది అయినా పట్టేలా వుంది. ఆలోగా ఓ సినిమా చేసేయచ్చు.

ఓ సినిమా అంటే వినాయక్ లాంటి డైరక్టర్ కు పది కోట్లకు పైనే ఆదాయం. అందుకే అంతటి ఆదాయం వదులుకోవడం ఎందుకని, ఆయన సాయిధరమ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఆకుల శివ అందించిన కథను ఈ సినిమా కోసం లాక్ చేసారు. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Show comments