మోడీ భక్తుల కుల గురువు.. ఇలా అన్నారు!

ఒకవైపు నోట్ల రద్దు నిర్ణయం సంచలనం అని.. నల్ల ధనికుల ఆట కట్టించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన మాటే చెబుతున్నాడు. ప్రజల  కష్టాల గురించి మాట్లాడకుండా.. మోడీ ప్రతిపక్ష పార్టీల మీద దాడికే ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడుతున్నాడు.

ఆ సంగతలా ఉంటే.. ఈ నోట్ల రద్దు వ్యవహారం ముందుగానే లీకైందని, ఇలా జరుగుతుందని ముందుగానే కొంతమందికి తెలుసని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించాడు.

మరి ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్లో ఈ మాటలు మాట్లాడి ఉంటే ఏదో ఆరోపణ చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఈ మాట చెబుతున్నది.. వీర హిందుత్వ వాది, భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ ఆర్థిక వేత్త.. మోడీ భక్త జనావళికి ఎంతో ఇష్టుడు అయిన సుబ్రమణ్య స్వామి.

స్వామిని ఆరాధించేస్తారు మోడీ భక్తులు. అలాంటి స్వామి, ఈ నోట్ల రద్దు వ్యవహారం కొందరికి ముందే తెలుసు అని స్పష్టం చేయడంతో పాటు, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు , ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని కూడా అన్నారు. కావాల్సిన వారికి లీకులు ఇచ్చుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ప్రజల కోసం ఏర్పాట్లను చేయడం పెట్టలేదని స్వామి స్పష్టం చేశారు.

వేరే ఎవరైనా ఈ మాటలు మాట్లాడి ఉంటే.. వాళ్లు నల్ల దొంగలు. దేశ ద్రోహులు. మరి స్వామిని కూడా దేశద్రోహి అంటారా, నల్ల దొంగ అంటారా! మోడీ భక్తులకే వదిలేయాలి ఈ విషయాన్ని. 

Show comments