సీరియల్ డైరక్టర్ గా పృధ్వీ

ఈ మధ్య థర్టీ ఇయర్స్ పృధ్వీ చెలరేగిపోతున్నారు. బ్రహ్మానందం కోసం తయారు చేసినట్లే, పృధ్వీ కోసం ఇప్పుడు డిఫెరెంట్ క్యారెక్టర్లు తయారుచేస్తున్నారు. సుశాంత్ నటిస్తున్న ఆటాడుకుందాం రా సినిమా పృధ్వీ టీవీ సీరియల్ డైరక్టర్ గా కనిపిస్తాడట. బాలయ్య స్ఫూఫ్ లు మాదిరిగా కాకుండా డిఫరెంట్ గా ఎంటర్ టైన్ మెంట్ పండిచాడట ఈ సినిమాలో. 

ఈ సినిమా మళ్లీ తనకు మంచి పేరు తెస్తుందని మాంచి కాన్ఫిడెంట్ గా వున్నాడట పృధ్వీ. ఈ సినిమాలో పృధ్వీ తీసే ఓ ఎపిసోడ్ మగధీరను పోలి వుంటుందట. కేవలం దానికోసమే కాస్త భారీగా ఖర్చు చేసారట. నాగేశ్వర రెడ్డి అంటే నే కామెడీ బాగా పండిస్తాడు. దానికి తోడు పృధ్వీ లాంటి ఏక్టర్,తగిన ఎపిసోడ్ దొరికితే ఇక థియేటర్లో నవ్వులే నవ్వులు.

Show comments