బీచ్‌ అండ్‌ బికినీతో థ్యాంక్స్‌ చెప్పిందోచ్‌.!

సోషల్‌ మీడియాని సెలబ్రిటీలు భలేగా వాడేసుకుంటున్నారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి, సినీ సెలబ్రిటీల దాకా.. సోషల్‌ మీడియాని తమ 'ప్రచారం' కోసం వాడుకుంటున్న తీరు విస్మయానికి గురిచేయకమానదు. మొన్నామధ్య బెల్లీ బ్యూటీ ఇలియానా అండర్‌ వాటర్‌ సూపర్‌ గ్లామరస్‌గా బికినీతో సందడి చేస్తూ, ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం విదితమే. ఆ వీడియోకి వచ్చిన ఫాలోయింగ్‌కి మురిసిపోతూ, థ్యాంక్స్‌ కూడా అలాంటి వీడియోతోనే చెప్పింది.

తాజాగా, తన కుటుంబం.. అదేనండీ, అభిమానుల సంఖ్య 2 మిలియన్లు దాటిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, బీచ్‌ అండ్‌ బికినీలో 'థ్యాంక్స్‌' చెప్పింది 'చిరుత' ఫేం నేహా శర్మ. తెలుగులో 'చిరుత', 'కుర్రాడు' తదితర సినిమాల్లో నేహా శర్మ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. బాలీవుడ్‌లో ప్రస్తుతం కాస్త బిజీగా వున్న నేహా శర్మ, 2016 తనకు బాగా కలిసొచ్చిందనీ, 2017లో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులతో అభిమానుల మనసుల్ని గెలుచుకుంటాననీ అంటోంది. 

సినిమాలతో ఆకట్టుకోవడం సంగతెలా వున్నా, సోషల్‌ మీడియా 'సెడస్ట్రస్‌' పూనమ్‌ పాండే తరహాలో అందాల భామలంతా సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తుండడం విశేషమే మరి.

Show comments