వెంకీతో పివీపీ సినిమా?

బాబు బంగారం సినిమా చేస్తున్నారు విక్టరీ వెంకటేష్.  మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత ఏం చేయాలి అన్న దానిపై వెంకీ చాలా క్లారిటీగానే వున్నట్లు తెలుస్తోంది. సబ్జెక్ట్ లు రెండు మూడు రెడీగా వుంచుకున్నారు..వీటిలో రీమేక్ లు కూడా వున్నాయి. అయితే బాబు బంగారం తరువాత వెంటనే మాత్రం మాధవన్ సినిమా సాలా ఖడూస్ ను రీమేక్ చేస్తారని తెలుస్తోంది.

దీనికి నిర్మాతగా పివిపి వ్యవహరించబోతున్నట్లు వినికిడి. ఈ సినిమాకు మాతృకను అందించిన సుధ దర్శకత్వం వహిస్తారు. నిజానికి ఆమె తెలుగు వారే. విశాఖకు చెందిన ఆమె పూర్తి పేరు సుధ కొంగర ప్రసాద్. ఈ సినిమాను త్వరలోనే సెట్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వినికిడి. నిజానికి ఈ సినిమా తమిళ వెర్షన్ కు పివిపి నే ఫైనాన్షియర్ అని వినికిడి. అందువల్ల తెలుగు సినిమాకు కూడా కేవలం ఫైనాన్షియర్ గా వుంటారా? లేక పార్టనర్ గా మారతారా అన్నది చూడాలి. ఒక వేళ ఈ సినిమాను ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే వుంటానంటే పివిపి తెరవెనుకే వుంటే అవకాశం వుంది. 

ఇదిలా వుంటే ఈ సినిమాకు వెంకీ గడ్డం దట్టంగా పెంచాల్సి వుంటుంది. దానికి బాగా టైమ్ పడుతుంది. ఆ కారణంతోనూ, ఇతరత్రా కారణాలతోనూ, ఆ సినిమాను వెనక పెట్టి, ముందుగా మరో సినిమా చేయాలన్న ఆలోచనలో కూడా వెంకీ వున్నట్లు తెలుుస్తోంది. అలా చేస్తే, ఆ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తారు. కిషోర్ తిరుమల గతంలో రామ్ తో నేను శైలజ సినిమా అందించారు.

Show comments