భారీ రేంజ్ లో ప్రేమమ్ అడియో

ప్రేమమ్ అడియో ఫంక్షన్ రేపే..చందు మొండేటి డైరక్షన్ లో నాగ్ చైతన్య-శృతి హాసన్ తదితరులు నటించిన ప్రేమమ్ అడియో ఫంక్షన్ నోవాటెల్ లో మంగళవారం జరగబోతోంది. ఈ ఫంక్షన్ ను కాస్త భారీ గానే చేస్తున్నారు.ఈ ఫంక్షన్ కు నాగార్జున తన కుటుంబం సభ్యులందరితో హాజరు కాబోతున్నట్లు సమాచారం. నాగార్జున తన కుటుంబ సభ్యుల ఫంక్షన్లు అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు అందరూ కలిసే వస్తారు? 

పైగా సెప్టెంబర్ 20 అంటే అక్కినేని జయంతి. అందువల్ల ఆ రోజు జరిగే ఫంక్షన్ లో ఫ్యామిలీ అంతా ఉంటే బాగుంటుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో నటిస్తున్న శృతి హాసన్ తో సహా ముగ్గురు హీరోయిన్లు వస్తున్నారు. అదే విధంగా  హారిక హాసినితో అనుబంధం, ఇటు అన్నపూర్ణతో అనుబంధం వున్న అనేక మంది డైరక్టర్లు ఈ అడియో ఫంక్షన్ కు వస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక కీలకంగా హారిక హాసిని చినబాబుతో అనుబంధం వున్న దర్శకుడు దాసరి నారాయణరావు కూడా ఈ ఫంక్షన్ కు హాజరవుతారు. దిగ్దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పంక్షన్ కు హాజరు కావాల్సి వుంది. కానీ ఆయన అనుకోకుండా అర్జెంట్ పనిపై మంగళవారం క్యాంప్ వెళ్తుండడంతో హాజరు కావడం లేదు. ప్రస్తుతం కోచీలో సంగీత దర్శకుడు గోపీసుందర్ తో సినిమా రీరికార్డింగ్ పనిలో బిజీగా వున్న చందు మొండేటి కూడా ఆ వేళకు ఫంక్షన్ కు వస్తారు.

అందరూ ఒకె. మరి నాగ్ చైతన్య ఫియాన్సీ సమంత మాటేమిటో?

Show comments