ఇంకా శ్రీనువైట్లకు సీనుందా?

ముచ్చటగా మూడు డిజాస్టర్లు తెలుగు ప్రేక్షకులకు అంకింతం ఇచ్చాడు దర్శకుడు శ్రీనువైట్ల. అయినా కూడా ఇంకా మరో ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఓ మాంచి స్క్రిప్ట్ ను తయారుచేస పనిలో బిజీగా వున్నాడట. మహేష్ బాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోలు అవకాశం ఇచ్చినా, వాటిని సద్వినియోగం చేసుకోలేదు. సరైన స్క్రిప్ట్ లు తయారుచేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

ఇప్పుడు మళ్లీ నాలుగో ప్రయత్నం ప్రారంభించాడని టాలీవుడ్ టాక్. అస్సలు బాహ్యప్రపంచాన్ని వదిలేసి, పూర్తిగా స్క్రిప్ట్ తయారుచేసుకోవడంలో బిజీగా గడిపేస్తున్నాడట. సరే, ఆయన అంటే ఖాళీగా వున్నాడు కాబట్టి అదే పనిపై వుంటే వుండొచ్చు గాక. కానీ ఏ హీరో అవకాశం ఎవరు ఇస్తారు అన్నదే సందేహం? ఇప్పటికీ మిస్టర్ ఫలితాన్ని తలుచుకుని, తనలో తానే బాధపడుతున్నాడు వరుణ్ తేజ. అతన్ని చూసాక మరే హీరో ధైర్యం చేస్తారు? కొత్త హీరోని ఎవర్నయినా వెదికి పట్టుకోవాలి? సందీప్ కిషన్ మీద శ్రీనువైట్ల దృష్టి వుందని వినికిడి. మరి అతగాడు ఏమంటాడో?

తెలిసి తెలిసి మూడు ఫ్లాపులు ఇచ్చిన డైరక్టర్ కు అవకాశం ఇచ్చే నిర్మాత వుంటారా? అందులోనూ మిస్టర్ సినిమాతో పాతిక కోట్లకు లాస్ అయిపోయిన నిర్మాతలను చూసి ఎవరైనా ముందుకు వస్తారా? ఏమో ఎప్పటికైనా గుర్రం ఎగురుతుందేమో ?

Show comments