కిరా దత్ గుర్తుందా.? అదేనండీ, 'రేసుగుర్రం' సినిమాలో 'బూచాడే..' అంటూ సాగే ఐటమ్ సాంగ్లో అల్లు అర్జున్తో చిందేసింది కదా.? ఆ బ్యూటీనే కిరా దత్. ఇప్పుడీ బ్యూటీ మరో తెలుగు సినిమాలో కన్పించబోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా కోసం కిరా దత్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
హిందీలోనూ, పలు తమిళ సినిమాల్లోనూ 'స్పెషల్ అప్పీయరెన్స్' ఇచ్చిన ఈ బ్యూటీ, బాలయ్య సినిమాలోనూ ఐగమ్ సాంగ్లోనే కన్పించనుందేమో.! ప్రస్తుతం పోర్చుగల్లో బాలయ్య - పూరి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా భారీ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే, కిరా దత్ కూడా షూటింగ్లో పాల్గొననుందని తెలుస్తోంది.
అయితే, కిరా దత్ ఎంట్రీపై పూరి అండ్ టీమ్ సస్పెన్స్ మెయిన్టెయిన్ చేస్తుండడం గమనార్హం. 'ఆ సస్పెన్స్ని రివీల్ చేయకుండా వుండలేకపోతున్నాం..' అంటూ 'పూరి కనెక్ట్స్' (పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్వహిస్తోన్న సంస్థ) తరఫున హీరోయిన్ ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అన్నట్టు, 'రోగ్' ఫేం ఏంజెలాకి కూడా ఈ సినిమాలో ఛాన్స్ వుందట.