మెగా హీరోను మరోసారి ఆదుకుంటాడా..?

మెగా హీరోల్లో సాయిధరమ్ తేజతోనే ఎక్కువగా సినిమాలు చేశారు నిర్మాత దిల్ రాజు. నిజానికి సాయిధరమ్ తేజ కెరీర్ లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలిచ్చింది దిల్ రాజు మాత్రమే. అందుకే దిల్ రాజు అంటే సాయిధరమ్ తేజకు ప్రత్యేకమైన అభిమానం. శతమానంభవతి సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తే పరిశ్రమలో ఎవరూ పట్టించుకోకపోయినా.. తనే స్వయంగా దిల్ రాజుకు సన్మానం చేశాడంటే కారణం అదే. ఇప్పుడీ మెగా హీరోను మరోసారి ఆదుకునేందుకు దిల్ రాజు సిద్దమౌతున్నారు.

రీసెంట్ గా 2 డిజాస్టర్లు ఇచ్చాడు సాయిధరమ్ తేజ. తిక్కతో జనాలకు చుక్కలు చూపించిన ఈ హీరో, తాజాగా విన్నర్ తో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం చేస్తున్న"జవాన్" సినిమాపై అంచనాలే లేకుండా పోయాయి. ఇలాంటి టైమ్ లో సాయిధరమ్ తేజ కోసం మరో సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు.

శతమానం భవతితో హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న.. శ్రీనివాస కల్యాణం అనే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పైనే రానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసం మొదట రాజ్ తరుణ్ ను హీరోగా అనుకున్నారు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ప్లేస్ లో సాయిధరమ్ తేజను తీసుకోవాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే సాయిధరమ్ తేజతో సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి సినిమాలు తీసిన దిల్ రాజు.. ఈసారి అతడికి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Show comments