దర్శకుడు అవుతున్న మరో రచయిత

టాలీవుడ్ లో ఇప్పుడు రచయితలు వేరుగా దర్శకులు వేరుగా లేరు. మంచి రచయిత అయితే ఆటోమెటిక్ గా దర్ళకుడిగా మారిపోతున్నారు. మంచి కథ వుంటే వేరేవాళ్లకు ఇచ్చే బదులు తామే డైరక్ట్ చేయాలనుకుంటున్నారు. చాలా మంది రచయితలు ఇలా దర్శకులుగా మారారు. లేటేస్ట్ గా మరో రచయిత మెగా ఫోన్ పట్టబోతున్నారు. 

పలు భారీ సినిమాలకు రచయితగా పనిచేసిన వెలిగొండ శ్రీనివాస్ డైరక్టర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా ఆయన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లో రెండు సినిమాలు ఒకే చేసాడు. 

దొంగాట డైరక్టర్ వంశీ కృష్ణ తో రాజుగాడు సినిమా చేస్తున్నారు. అది చకచకా తయారవుతోంది. సంజన రెడ్డి డైరక్షన్ లో మారుతి కథతో మరో సినిమా ప్రారంభమైంది. సెకండాఫ్ స్క్రిప్ట్ రెడీ కాక, ఆగింది. మూడో సినిమాగా వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో ప్రాజెక్టు ఓకె అయింది. కాస్త కామెడీ బాగా పండిస్తాడని వెలిగొండ శ్రీనివాస్ కు పేరుంది. 

Show comments