కబాలి చూసేందుకు టాలీవుడ్ తహతహ

కబాలి ఫీవర్ ఓ రేంజ్ లో అలుముకుంటోంది. టాలీవుడ్ జనాలు ఎవరికి వారు ఎంత త్వరగా సినిమా చూద్దామా అని కిందా మీదా అవుతున్నారు. మామూలు సినిమా జనం విడుదల రోజు ఉదయం ఆటకు రెడీ అయిపోతే, సెలబ్రిటీల కోసం నైజాం డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్ మిడ్ నైట్ స్పెషల్ షో అరేంజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 రాత్రి పదకొండు తరువాతే ఈ షో వుంటుదని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా వేయాలంటే మాతృక నిర్మాత థాను అనుమతి కావాలి. ఓవర్ సీస్ టైమింగ్స్ తో సమానంగా ఇక్కడ షో వుండొచ్చని ఓ టాక్ కూడా వుంది. ఇదిలా వుంటే విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తమ స్టూడియో ప్రివ్యూ థియేటర్లోనే కబాలి చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇలా ఎవరికి వారు తమ తమ ఏర్పాట్లలో వున్నారు టాలీవుడ్ జనాలు. ఇదంతా కేవలం రజనీ ఓన్ చరిష్మా..క్రేజ్. అంతే. ఈ క్రేజ్ కు తగ్గట్టు సినిమా ఏమాత్రం వున్నా, ఎక్కడికో వెళ్లిపోతుంది బిజినెస్.

Show comments