భారీ డీల్.. సెల్ ఫోన్ యాడ్ లో ప్రభాస్

మొన్నటివరకు ఆ మొబైల్ యాడ్ లో అలియా భట్ మాత్రమే కనిపించేది. తన ముద్దు ముద్దు మాటలతో యాడ్ కు ఓ లుక్ తీసుకొచ్చింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సెల్ఫీలు దిగుతూ ప్రమోషన్ బాగానే చేసింది. కానీ ఇకపై జియోనీ మొబైల్ యాడ్ లో అలియాభట్ కనిపించదు. ఆమెను తప్పించి ఆ స్థానంలో ప్రభాస్ ను పెట్టారు. 

స్మూత్ గా ప్రమోషన్ చేస్తే లాభంలేదని భావించిన ఈ చైనీస్ దిగ్గజ మొబైల్ సంస్థ, ఏకంగా బాహుబలిని రంగంలోకి దించింది. బాహుబలి-2తో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. అతడితో యాడ్స్ చేసేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ మొత్తానికి ప్రభాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థ.

ప్రభాస్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే యాడ్ షూటింగ్ ఉంటుంది. ఈ యాడ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాతే సాహో సెట్స్ పైకి వస్తుంది.

Show comments