3 పాటలు.. క్లైమాక్స్ మాత్రమే మిగిలిందట

ఈ నెలలో విడుదల కావాల్సిన దువ్వాడ జగన్నాధమ్-డీజే, వచ్చే నెలకు వాయిదాపడిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి 3 పాటలు, క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని చెబుతున్నారు.

మూవీకి సంబంధించి బన్నీ ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. డబ్బింగ్ పూర్తయిన తర్వాత పాటల పిక్చరైజేషన్ ఉంటుందట. హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

డీజే సినిమాకు సంబంధించి చాలా వరకు రీషూట్స్ చేశారనే ప్రచారం జరిగింది. తీసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ తీయడంతో చాలా వర్క్ పెండింగ్ లో పడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. వీటికి చెక్ పెట్టేందుకే 3 పాటలు, క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ అంటూ అప్ డేట్ అందించారు మేకర్స్.

Show comments