25 కు రుమాళ్లేస్తున్నారు

సినిమాలు ఎక్కువ..డేట్లు తక్కువ అన్నట్లుంది టాలీవుడ్ పరిస్థితి. ప్రతివారం అరడజను సినిమాలు. అప్పటికీ ఎక్కడో దూరంగా డేట్ వుందని ఫిక్సయితే, ఆ డేట్ దగ్గరకు వచ్చేసరికి కాంపిటీషన్ పీక్స్ లో వుంటోంది. ఈ నెల 11, 18 డేట్లు దాదాపు బుక్ అయిపోయాయి. దాంతో ఇప్పుడు జనాల చూపు 25 మీద పడింది. నవీన్ చంద్, పృధ్వీ హీరోలుగా నటించిన మీలో ఎవరు కోటీశ్వరుడు 25 కు ఫిక్సయిపోయింది. 

అలాగే మంచి అంచనాలున్న డబ్బింగ్ సినిమా మన్యం పులి కూడా 25కు ఫిక్సయిపోయింది. మోహన్ లాల్, జగపతి బాబు నటించిన ఈ సినిమా మలయాళంలో భయంకరమైన హిట్ అయింది. ఈ రెండు సినిమాలు ఇలా వుంటే ఇదే డేట్ ను శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా కూడా పరిశీలిస్తోంది. 

ఇదిలా వుంటే నిఖిల్ ఎక్కడికిపోతావు చిన్నవాడా 18 లేదా 25 అంటూ ఊగిసలాడుతోంది. ఇలా మొత్తం మీద 25వ తేదీ కూడా మాంచి సుముహర్తంలాగే కనిపిస్తోంది.

Show comments