జనతా గ్యారేజ్ అడియో ఖమ్మంలో?

తెలుగురాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ తో పాటు ఆంధ్రలో కూడా జరగడం మామూలయింది. అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప్పు..నిప్పులా వున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ అడియో ఫంక్షన్ ఖమ్మంలో చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

అన్ని విధాలా అది బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్నటికి నిన్న ఖమ్మం నుంచి వచ్చి కలిసిన అభిమానులతో ఎన్టీఆర్ సూచన ప్రాయంగా చెప్పినట్లు వినికిడి. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అభిమానులు కాస్త ఎక్కువే. వారే బాలయ్య అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు కూడా. 

చంద్రబాబుతో అంతగా పొసగని ఎన్టీఆర్ ఆంధ్రలో ఫంక్షన్ చేయకపోవచ్చు. అందుకే బోర్డర్ లో వుండే ఖమ్మంలో చేస్తే ఉభయతారకంగా వుంటుందనుకుంటున్నారేమో?

Show comments