రష్మినా.? అనసూయనా.? ఆమె సంగతేంటి.!

బుల్లితెర బ్యూటీస్‌లో మోస్ట్‌ పాపులర్‌ కొందరుంటారు. అందులో లాస్య పేరు ఖచ్చితంగా వుంటుంది. ఇప్పుడంటే రష్మి, అనసూయ, శ్రీముఖి పాపులర్‌ అయ్యారుగానీ, వీరికన్నా ముందు లాస్య పాపులర్‌. అంతకు ముందు ఉదయభాను లాంటోళ్ళున్నారనుకోండి.. అఫ్‌కోర్స్‌, అందరికంటే పాపులర్‌ సుమ.. అది వేరే విషయం. 

ఇక, బుల్లితెరపైనుంచి వెండితెరపైకొచ్చినవారిలో రష్మి, అనసూయ ఈ మధ్యకాలంలో బాగా సందడి చేస్తున్నారు. చేసే సినిమాల సంగతెలా వున్నా, ఈ ఇద్దరి పేరూ సినీ పరిశ్రమలో మార్మోగిపోతోంది. రష్మి అయితే గ్లామర్‌తో, అనసూయ అయితే వివాదాలతో.. టాలీవుడ్‌లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. 

ప్రస్తుతం ఈ ఇద్దరి బాటలో లాస్య కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇస్తోంది. 'రాజా మీరు కేక' సినిమాతో లాస్య తెరంగేట్రం చేస్తోంది. సినీ పరిశ్రమలో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?' అన్నది హాట్‌ టాపిక్‌ అయితే, బుల్లితెరపై 'రవి - లాస్య ఎందుకు విడిపోయారు.?' అన్నది ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్న చుట్టూ యాంకర్‌ రవినే అనేక స్కిట్స్‌ చేసేశాడు, చేస్తూనే వున్నాడు. శ్రీముఖి ఎంట్రీతో లాస్యకి బుల్లితెరనుంచి 'ఎగ్జిట్‌' లభించిందని చెప్పక తప్పదు. 

ఆ మధ్య రాజ్‌తరుణ్‌తో పెళ్ళయిపోయిందంటూ లాస్య పేరు వార్తల్లోకెక్కింది. అదంతా తూచ్‌ అని రాజ్‌తరుణ్‌ ఖండించేశాడనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, లాస్య వెండితెరపై వెలిగిపోవడానికి సిద్ధమయ్యింది. రష్మి హాట్‌ హాట్‌గా రెచ్చిపోయిన 'గుంటూరు టాకీస్‌' సినిమా గుర్తుంది కదా.? ఆ సినిమా నిర్మాతలే ఈ 'రాజా మీరు కేక' సినిమాని నిర్మిస్తున్నారు. మరి, లాస్య రేంజ్‌ ఈ సినిమాతో రష్మిని దాటేస్తుందా.? లేదంటే అనసూయలా వెరైటీ సినిమా చేస్తుందా.? ఏమో, వేచి చూడాల్సిందే.

Show comments