సినిమా జనాలకు ఆల్టర్ నేటివ్ చాన్స్

సినిమా జనాలు టీవీ సీరియళ్ల కేసి వెళ్లడం అన్నది పాత వార్త అయిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ ల కాలం వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడితే, ఇకపై ఫ్యూచర్ లో టీవీ సీరియళ్లను వెబ్ సిరీస్ లు రీప్లేస్ చేస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అది ఎంత వరకు సాధ్యం అవుతుందన్న సంగతి అలా వుంచితే ఇప్పటికే సినిమా జనాలు ఈ సిరీస్ ల్లోకి రావడం ప్రారంభమైపోయింది.

నాగబాబు కుమార్తె నీహారిక వెబ్ సిరీస్ తోనే పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో సుమంత్ అశ్విన్ కూడా వెబ్ సిరీస్ లోకి వచ్చేసాడు. యుప్ టీవీ అందిస్తున్న ఎందుకిలా అనే సిరీస్ లో అతగాడు హీరో. అతగాడే కాదు, ఈ సినిమాకు బ్యాక్ బోన్ క్రియేషన్ అంతా డైరక్టర్ దేవా కట్టాదే. ఆటోనగర్ సూర్య , డైనమైట్ తరువాత సరైన చాన్స్ లు రాలేదు. మంచి డైరక్టర్ అయినా హిట్ లు ముఖ్యం కదా? అందుకే ఇప్పుడు ఈ సిరీస్ కు అండగా వున్నట్లున్నారు.

ఆయనే కాదు దీనికి సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి కూడా చాలా మంచి సినిమాలకు పనిచేసిన వారే. అలాగే సంగీతం అందిస్తున్న మహేష్ శంకర్ కూడా సినిమా నేపథ్యంలోంచి అక్కడకు వెళ్లినవాడే. ఇంక నటులు కూడా సినిమా వాళ్లు కనిపిస్తున్నారు.

మొత్తం మీద సినిమా జనాలకు ఇదో ఆల్టర్ నేటివ్ గా దొరికే అవకాశం కనిపిస్తోంది. 

Show comments