'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతా బసు ప్రసాద్, ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయడంలేదు. బుల్లితెరపై ఓ యాక్షన్ 'షో'లో మాత్రం శ్వేతా బసు ప్రసాద్ ఈ మధ్య బాగానే కన్పిస్తోంది. నవదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు ఆ 'షో'కి. ఇందులో శ్వేతా బసు ప్రసాద్ చేస్తోన్న స్టంట్స్ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం.
స్వతహాగా డేరింగ్ అండ్ డాషింగ్ అయిన శ్వేతా బసు ప్రసాద్, ఆ తొందరపాటుతోనే కెరీర్ని అటకెక్కించేసుకుంది. ఆ మధ్యన 'వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడింది..' అంటూ వార్తల్లోకెక్కిన శ్వేత, కొన్నాళ్ళపాటు బాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడే కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కన్సల్టెంట్గా పనిచేసింది. ఈ సమయంలోనే రోహిత్ మిట్టల్ అనే ఫిలిం మేకర్తో పరిచయం ఏర్పడింది శ్వేతా బసు ప్రసాద్కి. అప్పట్లో రోహిత్తో డేటింగ్ వార్తల్ని కొట్టి పారేసినా, ఇప్పుడు 'డేటింగ్ నిజమే' అని ఒప్పుకుంది.
డేటింగ్ నిజమే అయినా, పెళ్ళి ఆలోచన ప్రస్తుతానికైతే ఈ ఇద్దరికీ లేదట. అదేంటీ.? అనడిగితే, అదంతే.. అని సమాధానమిచ్చింది శ్వేతా బసు ప్రసాద్. డేటింగ్లో ఇద్దరం ఒకర్ని ఒకరు ఇంకా అర్థం చేసుకోవాల్సి వుందనీ, పెళ్ళి గురించి కాలమే సమాధానం చెబుతుందనీ శ్వేతా బసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. 'వ్యభిచారం' ఆరోపణల సంగతేంటని అడిగితే, 'అందులో వాస్తవం ఎంతో నాకు మాత్రమే తెలుసు.. అది నా జీవితంలో అతి దురదృష్టకరమైన సంఘటన..' అంటూ ఉద్వేగంగా చెప్పింది శ్వేతా బసు ప్రసాద్.