'' తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇది నా ధ్యేయం. అందుకోసం నేను ఖర్చు పెడతాను. కష్టపడతాను. పార్టీకి సమయమిస్తాను. ఏమైనా చేస్తాను. అవసరమైతే మర్డర్ అయినా చేస్తాను. నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యం''... మతత్వ టెర్రరిస్ట్ గ్రూపుల మనస్తత్వానకి ఈయనికి ఏమైనా తేడా ఉందా?..
తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైతే మర్డర్ అయినా చేస్తాడట.. ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి దీక్ష కలిగి ఉండాలట.. తిరుపతి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి బాస్కర్ నాయుడు మాటలివి. జిల్లాలో జరిగిన టీడీపీ మినీమహానాడులో జిల్లా పార్టీ నేతల సమక్షంలో ఆయన ఇలా ఉన్మాదిలా మాట్లాడాడు.
ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రత్యర్థి వర్గాలను అధికార తెలుగుదేశం కార్యకర్తలు తరిమి తరిమి నరుకుతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం పడికట్టు పదాలతో అదరగొడుతున్నాడు. ఫ్యాక్షన్ సహించను. రౌడీయిజం ఒప్పుకోను అని రంకెలేస్తుంటాడు. మరోవైపు తమ్ముళ్లు మాత్రం అధికారం కోసం అవసరమైతే మనషులను చంపేందుకు కూడా వెనకాడబోమని ప్రతినబూనుతుంటారు. ఏమిటీ నాటకం. ఎవరి అండా ఆపు చూసుకుని పచ్చ పిచ్చోళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు. దీని వెనకాల ముఖ్యమంత్రి ప్రోద్బలం లేదంటే నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు వెర్రి వాళ్లుగా కనిపిస్తున్నారా?
సీఎం తన సొంత జిల్లా చిత్తూరులో ఒక పార్టీ నేత చేత ఇలా మాట్లాడించి కార్యకర్తలకు ఎలాంటి సందేశాలు పంపిస్తున్నాడు. అధికారం కోసం ఎంతకైనా తెగించండి. అవసరమైతే మందిని చంపండి. కేసుల్లేకుండా నేను చూసుకుంటా అనేగా.. ఎంతటి దౌర్భాగ్య పాలన ఈ రాష్ట్రంలో నడుస్తోందో చూడండి అని ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. బాబు పైకి చెప్పేదొకటి... లోపల చేసేదొకటి.. ఆయన ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి పని మోసపూరితమే అనే విపక్షాల మాటలు సామాన్య ప్రజలకు వాస్తవాలుగా తోస్తున్నాయి.
విన్నారా బాబు గారూ.. వేర్ వి ఆర్ గోయింగ్.