నాగశౌర్య ఇక గెడ్డం తీసేయచ్చు

జ్యో అచ్యుతానంద సినిమా తరువాత హీరో నాగశౌర్య గెడ్డం పెంచడం ప్రారంభించాడు. ఇలా అలా కాదు. భారీగానే పెంచేసాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఓ ధ్రిల్లర్ సినిమా కోసం ఈ గెడ్డం అన్నమాట. కొత్త దర్శకుడు ఒకరు మంచి లైన్ చెప్పడంతో నిర్మాత సాయి కొర్రపాటి ఓకె అన్నారు. నాగశౌర్యతో మంచి థ్రిల్లర్ నిర్మించాలనుకున్నారు. 

కానీ తీరా చేస్తే, లైన్ డెవలప్ చేయడంలో తేడా వచ్చేసిందని తెలుస్తోంది. సినిమా స్క్రిప్ట్ ఎంతకూ బాగా సెట్ కాకపోవడంతో, ఆ సినిమాకు తిలోదకాలు ఇచ్చేసారు. అంటే ఇక ఇప్పుడు శౌర్యకు గెడ్డంతో పని లేనట్లే అనుకోవాలి. ఇదిలా వుంటే శౌర్య దగ్గర అడ్వాన్స్ లు దండిగానే వున్నాయి. సుకుమార్, రాధామోహన్, ఇంకా..ఇంకా. కానీ ఒకటీ ఇఫ్పట్లో సెట్ మీదకు వెళ్లేవి మాత్రం కనిపించడం లేదు. 

Show comments