చిరంజీవి హీరోయిన్.. రీఎంట్రీకి రెడీ

చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. అయితే చిరంజీవి సరసన నటించి రీఎంట్రీ ఇవ్వని బ్యాచ్ కూడా సెపరేట్ గా ఉంది. సమీరారెడ్డి, సాక్షి శివానంద్ లాంటి భామలు ఈ కేటగిరీలోకి వస్తారు. వీళ్లలో ఇప్పుడు సమీరా రెడ్డి మరోసారి కెమెరా ముందుకు రావాలనుకుంటోంది. జై చిరంజీవ సినిమాలో చిరు సరసన నటించిన ఈ భామ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తోంది.

2012లో వచ్చిన కృష్ణంవందే జగద్గురుం సినిమాలో ఐటెంసాంగ్ చేసింది సమీరారెడ్డి. తెలుగులో ఆమె లాస్ట్ ఎప్పీయరెన్స్ అదే. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన సమీరా.. భర్తకు చెందిన ఆటోమొబైల్ బిజినెస్ వ్యవహారాల్ని చూసుకుంటోంది. మధ్యలో పేజ్-3 పార్టీస్ కు వస్తున్నప్పటికీ సినిమాల్లో మాత్రం కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు తనకు ఖాళీ సమయం దొరికిందని అంటోంది సమీరా. 

ఈ నాలుగేళ్లలో పరిశ్రమలో చాలా మార్పులు వచ్చేశాయని అంటున్న సమీరారెడ్డి.. కుదిరితే మరోసారి హిందీ, తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన టైమ్ లోనే అవకాశాలు అంతంతమాత్రంగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత హీరోయిన్ ఛాన్సులు వస్తాయా అనేది డౌట్. సమీరాకు కూడా ఈ అనుమానం ఉంది. అందుకే హీరోయిన్ పాత్రలు కాకపోయినా, మంచి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తోంది.

Show comments