బాలకృష్ణ, నాగార్జున ఈసారైనా కలుస్తారా..?

బాలకృష్ణ, నాగార్జున మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. సయోధ్య కోసం ఆ మధ్య నాగార్జున ప్రయత్నించారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ స్టిల్ ఇప్పటికీ ఈ ఇద్దరు బడా హీరోల మధ్య చిన్నపాటి అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉందని టాక్. ఇలాంటి టైమ్ లో ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నారు. టీఆస్ఆర్ అవార్డుల వేదికపై నాగ్, బాలయ్య పరస్పరం ఎదురుపడబోతున్నారు.

టీఆస్ఆర్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాగార్జున పేరును, బెస్ట్ హీరో కేటగిరీలో బాలకృష్ణ పేరును ప్రకటించారు. స్వయంగా సుబ్బరామిరెడ్డి పిలుస్తారు కాబట్టి ఈ ఇద్దరు స్టార్లు అవార్డు ఫంక్షన్ కు రావాల్సిందే. వస్తే కనుక సుబ్బరామిరెడ్డి కచ్చితంగా ఇద్దర్నీ ఒకేసారి వేదికపైకి పిలుస్తారు. వాళ్లిద్దరితో కలిసి ఫొటోలకు పోజులిస్తారు. కనీసం ఈ కార్యక్రమమైనా ఈ ఇద్దరు స్టార్స్ ను కలుపుతుందేమో చూడాలి.

బాలకృష్ణ ఇప్పుడు అందరివాడు అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏ ఈవెంట్ జరిగినా నలుగుర్ని కలుపుకుపోతున్నారు. అటు రాజకీయంగా, ఇటు ఇండస్ట్రీ పరంగా తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. ఇక నాగార్జున సంగతి సరేసరి. వివాదాలంటే అస్సలు ఇష్టముండదు మన్మధుడికి. నలుగురితో సరదాగా కలిసిపోతారు. సో.. వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్న అభిప్రాయ బేధాల్ని తొలిగించుకొని, అవార్డు ఫంక్షన్ వేదికపై కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show comments