తేజుతో ఫిక్సయిన వినాయక్?

ఖైదీ నెంబర్ 150 తరువాత సీనియర్ దర్శకుడు వివి వినాయక్ ఎవరితో చేస్తారు? అన్నది కాస్త క్యూరియాసిటీ కలిగించింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ బజ్ ఏమిటంటే, యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజతో ఫిక్స్ అయ్యారన్నది. దీనికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. 

ఖైదీ సినిమా తరువాత పవన్ ఓ సినిమాను వినాయక్ తో చేయడానికి మొగ్గారని టాక్ వినిపించింది. అయితే పవన్ ఇప్పుడు మూడు కమిట్ మెంట్ లతో వున్నారు. అందుకే ఆయనే ముందుగా ఓ సినిమా తేజుతో చేయమని చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ కెరీర్ పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో వున్న సంగతి తెలిసిందే. 

ఆ క్రమంలోనే అసలే కిందా మీదా అవుతున్న తేజు కెరీర్ కు వినాయక్ సినిమా హెల్ప్ అవుతుందని ఈ ప్రాజెక్టు సెట్ చేసారని తెలుస్తోంది. పైగా వినాయక్ కు కూడా ఫ్రస్తుతం వేరే ఆప్షన్స్ కూడా ఏమీ పెద్దగా లేవు. ప్రతి హీరో చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి. అందువల్ల ఆయన కూడా అటే మొగ్గుతున్నట్లు వినికిడి. ప్రస్తుతం తేజు జవాన్ సినిమా చేస్తున్నారు. బహుశా అది పూర్తయ్యేసరికి వినాయక్ ప్రాజెక్టు రెడీ అవుతుందేమో?

Show comments