మూడురోజుల్లో సూపర్ హిట్..ఆర్రోజుల్లో బ్లాక్ బస్టర్

పబ్లిసిటీకి కూడా ఓ హద్దు వుంటుంది. కానీ సినిమా జనాల ప్రచారానికి మాత్రం ఎటువంటి హద్దులు వుండవు. సాయి ధరమ్ తేజ లేటెస్ట్ మూవీ తిక్క డిజాస్టర్ అన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో అతడి సినిమాలకు చేసిన పబ్లిసిటీ మాయనే ఈ సినిమాకు కూడా చేసి, మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసేసుకోవాలని అనుకుంటున్నట్లుంది. 

తిక్క సినిమాకు మూడు రోజుల్లో 19 కోట్ల 63 లక్షలు వసూలు చేసిందంటూ ఫ్రకటనలు వచ్చేసాయి. ఇదంతా సాయి ధరమ్ తేజ స్టామినాకు నిదర్శనం అంటూ స్టేట్ మెంట్లు కూడా వాటిల్లో ఇచ్చేసారు. తిక్క సినిమాకు అయిన ఖర్చు 18 కోట్లు.మూడు రోజుల్లో 19 కోట్లకు పైగా వచ్చేసింది అంటే, ఇక లాభాలే లాభాలు అన్నమాట నిర్మాతకు. 

ఎందుకంటే తిక్క సినిమాను కొనేవారు లేక, నిర్మాతే డైరక్ట్ గా విడుదల చేసుకున్నారని వినికిడి. అంటే లాభాలన్నీ నిర్మాతకే. మూడు రోజుల్లో ఇరవై కోట్ల దగ్గరకు వసూలు చేసింది అంటే  దర్ళకుడు సునీల్ రెడ్డి ఇంటి ముందు, హీరో సాయి ధరమ్ తేజ ఇంటి ముందు ఇక నిర్మాతలు క్యూలు కట్టేస్తారు. సాయి ధరమ్ తన పారితోషికాన్ని ఏడెనిమిది కొట్లకు చేర్చేయచ్చు. తిక్క సినిమాకే ఇలా కలెక్షన్లు వచ్చాయంటే టాలీవుడ్ లో ఈ ఏడాది ఫ్లాపులు లేనట్లే. అన్నీ బ్లాక్ బస్టర్లే.

Show comments