అందుకే నాగ్ అంతమాట అనేశాడు

ప్రస్తుతం రాజుగారి గది-2 సినిమా చేస్తున్నాడు నాగార్జున. అయితే ఈ సినిమా కంటే ముందు తను నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ పై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ ప్రమోషన్ లో మాట్లాడిన నాగార్జున.. రాజుగారి గది-2పై అనుమానాలు వ్యక్తంచేశాడు. "సినిమా ఓకే కానీ.." అంటూ చిన్న మెలిక పెట్టాడు.

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాజుగారి గది-2 సినిమా. 10 రోజుల షూటింగ్ మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయింది. సమంత పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. "రాజుగారి గది-2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో 10 రోజులు షూటింగ్ ఉంది. ఇప్పటివరకు తీసిన సినిమా అంతా ఒకసారి చూసుకొని ఆ 10 రోజుల షూట్ ప్లాన్ చేస్తాం" అన్నాడు నాగ్.

రాజుగారి గది-2పై నాగార్జునకు కొన్ని అనుమానాలున్నాయి. కొన్ని సన్నివేశాల్ని కచ్చితంగా రీషూట్ చేయాల్సిన అవసరముందని కూడా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే నాగచైతన్య సినిమా హడావుడిలో పడి రాజుగారి గది-2పై ఫోకస్ తగ్గించాడు. రారండోయ్ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే రాజుగారి గదికి రిపేర్లు మొదలుపెడతారు. టోటల్ రష్ అంతా చూసి ఎన్ని రీషూట్లు చేయాలి, ఎన్ని రోజులు షూట్ చేయాలి లాంటివి డిసైడ్ చేస్తారు. అదన్నమాట సంగతి. అందుకే రిలీజ్ డేట్ అడిగినా తర్వాత ఎనౌన్స్ చేస్తామంటూ తప్పించుకున్నాడు నాగ్.

Show comments