అక్కినేని నాగార్జున పుత్రోత్సాహం

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'ప్రేమమ్‌' సినిమా విడుదలయిన సమయంలో, అక్కినేని నాగార్జున విదేశాల్లో వున్నారు. తన కుమారుడి సినిమా 'ప్రేమమ్‌' మంచి విజయం సాధించినట్లుగా తనకు రిపోర్ట్స్‌ అందుతున్నాయంటూ సోషల్‌ మీడియా ద్వారా నాగార్జున పుత్రోత్సాహాన్ని ప్రదర్శించారు. హైద్రాబాద్‌లో ల్యాండ్‌ అవగానే, చైతూని కలిసి హగ్‌ ఇవ్వాలని వుందని సోషల్‌ మీడియాలో ట్వీటేసిన నాగ్‌ పేర్కొన్నారు. 

కళ్యాణ్‌ జ్యుయెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున, కువైట్‌లో ఆ జ్యుయెలరీ సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్‌లో తెలుగువారు తనపై చూపించిన ఆప్యాయతాభిమానాలకు నాగ్‌ ముగ్ధడయ్యారట. వాళ్ళంతా తనపై 'ప్రేమమ్‌' చూపించారని నాగార్జున చెప్పుకొచ్చారు. కువైట్‌ నుంచి బయల్దేరిన నాగార్జున, హైద్రాబాద్‌కి చేరుకోగానే సకుటుంబ సమేతంగా 'ప్రేమమ్‌' సినిమాని తిలకించనున్నారు. 

ఇదిలా వుంటే, 'ప్రేమమ్‌' సినిమాకి సంబంధించి ఫ్యామిలీ పరంగా అక్కినేని నాగార్జున సినీ ప్రముఖులకు ఓ 'ట్రీట్‌'ని ఎరేంజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments