నోటీసు అందింది కానీ..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అంతా భుజాలు తడుముకుంటున్నారు. తమకు అసలు నోటీసులే అందలేదని కొందరు సినీప్రముఖులు చెబుతుంటే, "నోటీసులు అందాయి కానీ.." అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరికొందరు. ఇప్పటికే ఈ వివాదంపై తనీష్, నందు లాంటి నటులు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నటుడు సుబ్బరాజు కూడా ఎంటర్ అయ్యాడు.

"నాకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. 21వ తేదీన సిట్ నిర్వహించే దర్యాప్తునకు హాజరుకావాలని అందులో ఉంది. అయితే నాకెందుకు నోటీసు వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ డౌట్ నాలో ఇంకా ఉంది.

వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా ఆ రోజు నేను విచారణకు హాజరవుతాను. నా సర్కిల్ లో ఎవరికీ డ్రగ్స్ తీసుకునే అలవాట్లు లేవు. ఎందుకు లిస్ట్ లో పేరొచ్చిందో అర్థం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో".

సుబ్బరాజు అయితే సింపుల్ గా చెప్పేశాడు. కానీ నోటీసు ఊరికే రాదనేది ఇంటర్నల్ టాక్. డ్రగ్స్ సేవిస్తేనే నోటీసు అందుతుందని అనుకోవడం పొరపాటు అవుతుందని ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అంటే ఈ డొంకలో చాలా లింకులున్నాయన్నమాట.

Show comments