ట్విట్టర్ లో చేరిన చైతూ హీరోయిన్

ట్వీట్స్ చేయకపోయినా కచ్చితంగా అఫీషియల్ ఎకౌంట్ మాత్రం ఉండాలి. పోస్టులు పెట్టకపోయినా ఓ అధికారిక ఫేస్ బుక్ పేజీ తప్పనిసరి. లేదంటే ఫేక్ ఎకౌంట్లు పుట్టుకొస్తాయి.. కొంపలు మునిగిపోతాయి. అందుకే మడొన్నా సెబాస్టియన్ కూడా ట్విట్టర్ లో చేరిపోయింది. తనకు సోషల్ మీడియా అంటే అస్సలు పడదని చెప్పుకొచ్చిన  ఈ భామ తప్పనిసరి పరిస్థితుల్లో ట్విట్టర్ ఖాతా తెరిచింది.

మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అదే సినిమా తెలుగు రీమేక్ తో టాలీవుడ్ లో కూడా పాపులర్ అయింది. ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన ఓ తమిళ సినిమా కూడా హిట్ అవ్వడంతో.. సౌత్ లో మడొన్నా పేరు మారుమోగిపోయింది. దీంతో కుప్పలుతెప్పలుగా ఆమె పేరుపై ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఓపెన్ అయిపోయాయి. రకరకాల గాసిప్స్ రాయడం, అడ్డమైన ఫొటోలు పెట్టడం చకచకా జరిగిపోయాయి. 

ఇన్నాళ్లుగా వీటిని భరిస్తూ వచ్చిన మడొన్నా ఇకపై అలాంటి వార్తలు, ఫొటోలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే తనకు ఇష్టంలేకపోయినా ట్విట్టర్ ఖాతా తెరిచింది. చేసిన తొలి ట్వీట్ తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చింది. “ఇదే నా మొదటి ట్వీట్.. మిగతా ఫేక్ ఎకౌంట్స్ ను పట్టించుకోకండి” అంటూ ట్వీట్ చేసింది.

Show comments