విడాకుల కోసం కోర్టుకు హాజరైన హీరో కూతురు

ఇది వరకే తన విడాకుల విషయాన్ని ధ్రువీకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనిపించింది. విడాకుల పిటిషన్ విచారణలో భాగంగా ఆమె కోర్టు కు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ హాజరీతో విడాకుల తతంగం పూర్తి అయినట్టు సమాచారం.

2010లో అశ్విన్ కుమార్ అనే వ్యాపారవేత్తతో సౌందర్య వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. తన పేరు వేద్. వివిధ పరిణామాల నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో వీరు విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ మధ్య ట్విటర్ లో ప్రకటించింది సౌందర్య.

కూతురు – అల్లుడి మధ్య రాజీ కోసం రజనీ యత్నించారని.. అయితే కుదరలేదని, అదంతా జరిగిన తర్వాతే సౌందర్య విడాకుల అంశాన్ని అనౌన్స్ చేసిందని సమాచారం. ఇది వరకూ తండ్రిని హీరోగా పెట్టి ఒక సినిమాకు దర్శకత్వం వహించిన సౌందర్య ఇప్పుడు బావ ధనుష్ హీరోగా ‘వీఐపీ-2’ సినిమాకు దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. 

Show comments