పవన్ కు తెలియడానికి ఇన్నాళ్లు పట్టిందా?

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడగా పెరిగింది. అమరావతి రాజధాని డబ్బున్న బాడా బాబులకే. కృష్ణ, గుంటూరు జనాలు మినహా అన్ని జిల్లాల వారూ బతికేంత సీన్ అమరావతిలో వుండదు.. తెలుగుదేశం పాలనలో కొన్ని కులాలకే ఫ్రాధ్యాన్యం

ఈ విషయాలు దాదాపు ఏడాదికి పైగానే చర్చల్లో నానుతున్నాయి. తెలుగుదేశం అభిమాన మీడియా సంగతి అలా వుంచితే, మిగిలిన మీడియా మాత్రం ఈ విషయాలను తరచు ఎత్తి చూపిస్తూనే వుంది. అయితే అదంతా కిట్టని వారి కథలు, జగన్ మద్దతు దారుల ఆరోపణలు అన్న తీరుగా కొట్టిపారేసారు.

కానీ ఇప్పుడు జనసేన అధిపతి పవన్ కూడా ఈ మాటలనే తన అనంతపురం ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ తన దృష్టికి వచ్చాయని, ఇవి నిజమో కాదో ఆలోచించి, నిజమైతే సరిచేసుకోవాలని పవన్ అన్నారు. అంటే పాపం, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వినిపిస్తున్న విషయాలు పవన్ చెవికి చేరడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. అంటే ఇవి నిజాలని ఆయనకు తెలియడానికి ఇంకెంత కాలం పడుతుందో?

Show comments