మళ్లీ వార్తల్లోకి టీవీ 9

తెలుగులో న్యూస్ చానెళ్లను కొత్త పుంతలు తొక్కించిన టీవీ 9 మరోసారి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. జీ టీవీ గ్రూప్ ఈ చానెల్ ను కొనాలని ప్రయత్నిస్తోందని బిజినెస్ పేజీల్లో వార్తలు కనిపిస్తున్నాయి. టీవీ 9 మాతృ సంస్థ అయిన ఎబిసిఎల్ లో ప్రధాన వాటాదారు అయిన శ్రీనిరాజు భాగాన్ని తమకు ఇస్తే, 850 కోట్లు ఇస్తామని జీ సంస్థ ఆఫర్ ఇచ్చినట్లు ఆ వార్తల సారాశం. 

టీవీ 9 ను విక్రయిస్తారని, కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చిరకాలంగా అప్పుడు అప్పుడు వార్తలు వినవస్తూనే వున్నాయి. కానీ ఏవీ మెటీరియలైజ్ కాలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో తెలుగులో లీడ్ లో వున్న జీ టీవీ న్యూస్ చానెల్ విభాగంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 

అందుకే మరోసారి ఈ విధంగా న్యూస్ చానెల్ విభాగంలో కూడా పట్టు సాధించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా తనకు అవసరం లేనివి విక్రయిస్తూ, కావాల్సినవి స్టార్ట్ చేస్తూ, జీటీవీ మొత్తం ఓ పద్దతిగా ముందుకు వెళ్తోంది. అందులో భాగమే టీవీ 9 టేకోవర్ వార్తలు అని బిజినెస్ వర్గాల బోగట్టా.

Show comments