దిల్ రాజు భక్తిన చాటిన ఫంక్షన్

నిర్మాత దిల్ రాజు కు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి. తన స్వంత ఊరిలో అద్భుతమైన వెంకన్న ఆలయం నిర్మించారు కూడా. అలాగే సినిమా విడుదలైన ప్రతి సారీ తిరుపతి వెళ్లి వస్తుంటారు. శతమానం భవతి విజయోత్సవ సభలో కూడా ఆయన ఈ భక్తిని అపరిమితంగా చాటుకున్నారు. పార్క్ హయాత్ లాంటి ఫైవ్ స్టార్ హోటల్ లో ఆధ్యాత్మికత వెల్లి విరిసేలా చేసారు.

పలువురు జీయర్ స్వాములను ఆయన ఈ సభకు రప్పించారు. వేదిక ను కూడా వెంకన్న మండపం మాదిరిగా చేసేసారు. జీయర్ స్వాముల ఆశీర్వచనాలతో దర్శకుడు వివి వినాయక్ కు సన్మానం జరిపారు. అంతే కాదు, ఆ జీయర్ స్వాముల ప్రసంగాలను సినిమా సభలో అందించడం విశేషం.

కాషాయ వస్త్రాలు, పావు కోళ్లు, దండాలు ధరించి జీయర్ స్వాములు, వారి అనుచర గణం పార్క్ హయాత్ లో వెళ్తుంటే, అక్కడ వుండే స్వదేశీ, విదేశీ అతిథులు అబ్బురంగా చూసారు.

Show comments