పాపను ప్రచారం కోసం దాచారట

అఖిల్ రెండో సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించారు. మరికొన్ని రోజుల్లో మరో భారీ షెడ్యూల్ కూడా మొదలవుతుంది.

అయితే ఇప్పటివరకు హీరోయిన్ ను మాత్రం ఎనౌన్స్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ ఎంపిక పూర్తయిందట.

సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు హీరోయిన్ ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. హీరోయిన్ షెడ్యూల్ స్టార్ట్ అయిన వెంటనే ఆ ముద్దుగుమ్మ ఎవరనే విషయాన్ని గ్రాండ్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఇక అక్కడ్నుంచి దశలవారీగా ప్రచారం చేస్తూనే ఉంటారట. ఓవైపు షూటింగ్, మరోవైపు ప్రమోషన్.. ఇలా సాగుతుందట అఖిల్ రెండో సినిమా.

అఖిల్ సినిమా కోసం మొదట అనుపమ పరమేశ్వరన్ పేరు తెరపైకి వచ్చింది. తర్వాత మేఘా ఆకాష్ పేరు కూడా వినిపిచింది. తాజాగా శ్రీదేవి కూతురు కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి వాస్తవాలు కావని స్వయంగా నాగార్జున స్పష్టంచేశాడు.

ఈ సినిమా కోసం ఖర్చుకు వెనకాడట్లేదు నిర్మాత నాగార్జున. మొదటి సినిమాతో అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న అఖిల్ కు ఎలాగైనా రెండో సినిమాతో హిట్ అందించాలనే కసితో ఉన్నాడు. ఈ సినిమాకు జున్ను, ఎక్కడ ఉందో తారక అనే టైటిల్స్ ను అనుకుంటున్నారు.

Show comments