ఉగాదికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన చెర్రీ

ఉగాది టైమ్ కి తన కొత్త సినిమా సెట్స్ పై ఉంటాడు రామ్ చరణ్. ఈనెల 20 నుంచి సుకుమార్ సినిమా ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఉగాది టైమ్ కు ఆ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉండబోతున్నాడు. సో.. అభిమానుల కోసం ఉగాదికి ఏమైనా గిఫ్ట్ అందించాలంటే అది సుకుమార్ సినిమా నుంచే రావాలి. కానీ రామ్ చరణ్ మాత్రం వేరే ప్లాన్స్ లో ఉన్నాడు. మరో సినిమాతో ఉగాది రోజున అభిమానులను ఆశ్చర్యపరచాలనుకుంటున్నాడు. 

త్వరలోనే మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. అంతా ఊహించినట్టు ఈ సినిమా లవ్ స్టోరీగా కాకుండా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఉగాది రోజున అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాడట చరణ్. కుదిరితే అదే రోజున మణిరత్నం సినిమాకు సంబంధించి ప్రీ-లుక్ ఒకటి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. 

ధృవ సినిమా విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు రామ్ చరణ్. ఫస్ట్ లుక్ కంటే ముందు ప్రీ-లుక్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశాడు. ఇప్పుడు మణిరత్నం సినిమాకు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నాడట. మరి ఈ ప్రీ-లుక్ కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేస్తారా.. లేక ధృవ సినిమా టైంలో చేసినట్టు పాత ఫొటోకే గ్రాఫిక్ వర్క్ జతచేసి ఫ్రెష్ గా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. 

Show comments