బాలయ్య కు కొత్త పిఎ

మొత్తానికి శాసనసభ్యుడిగా బాలకృష్ణ పేరు వివాదాల్లోకి లాగడానికి కారణమైన పిఎ శేఖర్ కు ఉద్వాసన తప్పలేదు. ఆయన స్థానంలో మరొకరిని ప్రభుత్వం నియమించింది. వి. వీరయ్య అనే గణాంకాల శాఖ ఉద్యోగిని బాలకృష్ణ పీఎ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బాలకృష్ణ పిఎగా పని చేసిన శేఖర్ కారణంగా అనంతపురం జిల్లా తెలుగుదేశంలో తీవ్ర అసంతృప్తి చెలరేగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నేరుగా కలుగచేసుకుని, పిఎ ని తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చింది. అయినా కూడా శేఖర్ కదలకుండా బాలయ్య నియోజకవర్గంలోనే ఉన్నారన్న వార్తలు వచ్చాయి.

ఇంతలో ఈ విషయాన్ని సద్దు మణిగించేందుకు బాలకృష్ణ హైదరాబాద్ లో అనంతపురం జిల్లా దేశం నాయకుల సమావేశం నిర్వహించి కృషి చేసారు. అయినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఏకంగా కొత్త నియామకం జరిగిపోయింది. ఇకనైనా శేఖర్ అనంతపురాన్ని వదిలేస్తారేమో చూడాలి.

Show comments