'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వయంగా పవన్కళ్యాణ్ని చరణ్ ఆహ్వానించాడు. కానీ, పవన్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. 'ఆల్ ది బెస్ట్' మాత్రం చెప్పేశాడు పవన్, సోషల్ మీడియాలో. ఆషామాషీ ఫంక్షన్ కాదది. 9ఏళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా కోసం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్. పిలుపుఅందినా, అందకపోయినా.. తమ్ముడిగా పవన్కళ్యాణ్, ఆ ఈవెంట్కి హాజరైవుండాలి. కానీ, అలా జరగలేదు.
చిత్రమేంటంటే, పవన్కళ్యాణ్ తరఫున 'కాటమరాయుడు' చిత్రనిర్మాత శరద్ మరార్ ఆ ఈవెంట్కి హాజరయ్యాడు. పవన్కళ్యాణ్, 'ఖైదీ నెంబర్ 150' టీమ్కి విషెస్ అందించారంటూ చెప్పుకొచ్చాడాయన. ఇక, ఇప్పుడు 'కాటమరాయుడు' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రంగం సిద్ధమవుతోంది. ఈనెల 18న ఈవెంట్ జరిగే అవకాశముంది. మరి, ఈ ఈవెంట్కి మెగా కాంపౌండ్ నుంచి ఎవరన్నా హాజరవుతారా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
'కాటమరాయుడు' నిర్మాత శరద్ మరార్ 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఈవెంట్కి వచ్చాడు గనుక, 'కాటమరాయుడు' ఈవెంట్కి 'ఖైదీ నెంబర్ 150' నిర్మాత.. అంటే చరణ్ హాజరవుతాడేమో.! అసలు, మెగా కాంపౌండ్కి 'కాటమరాయుడు' టీమ్ నుంచి 'ఇన్విటేషన్' అయినా వెళ్తుందా.? లేదా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. అభిమానులు మాత్రం.. మెగస్టార్, పవర్స్టార్ ఒకే వేదికపై కన్పించాలనుకుంటున్నారు. వారి కోరికలలాగే వుంటాయ్.. తీరాలికదా.?
అన్నట్టు రేపు 'కాటమరాయుడు' తొలి ఆడియో సింగిల్ రేపు మధ్యాహ్నం సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. 'మిర మిరా మీసం' అంటూ సాగే పాట అది.