మిల్కీ బ్యూటీ అయినా ఒప్పుకుంటుందా.?

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె పెళ్ళి వేడుకలో టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాస్సేపు డ్యాన్స్‌ చేసినందుకుగాను కోటి రూపాయలదాకా అందుకుందనే ప్రచారం జరిగింది. 'అంత సీన్‌ లేదు..' అంటూ రకుల్‌, ఆ వ్యవహారంపై వివరణ ఇచ్చింది. రకుల్‌ ఆ స్థాయిలో డిమాండ్‌ చేసినా, చెయ్యకపోయినా తన ప్రెస్టేజ్‌ ఇష్యూ కదా.. గాలి జనార్ధన్‌రెడ్డి ఆ మాత్రం ఇచ్చి వుంటాడులే.. అని జనం అనుకున్నారు. గాలి మీదనే కాదు, రకుల్‌ మీద కూడా ఐటీ ఎటాక్స్‌ జరిగాయన్న గుసగుసలు రకుల్‌కి కంటి మీద కునకు లేకుండా చేశాయి. 

ఇక, తాజాగా అదే కోవలో మిల్కీ బ్యూటీ తమన్నా వార్తల్లోకి ఎక్కుతోంది. 2016 డిసెంబర్‌ 31వ తేదీన పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల కోసం ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ తమన్నా వద్దకు వెళ్ళిందట. అయితే, తమన్నా వైపు నుంచి కోటికి పైనే డిమాండ్‌ వచ్చిందట. కోటి 20 లక్షలకు ఫైనల్‌ అయ్యిందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. 

అది చెన్నయ్‌లోని ఓ ప్రముఖ హోటల్‌ అనీ, మిల్కీ బ్యూటీ ఆ హోటల్‌ నిర్వహించే వేడుకల్లో డాన్స్‌ చేయడం ఖాయమనీ తమిళ తంబిలు అప్పుడే ప్రచారం షురూ చేసేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా నుంచి ఇంతవరకు ఈ వ్యవహారంపై స్పందన రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తం అన్న గాసిప్‌ ప్రచారంలోకి వస్తేనే సెలబ్రిటీలు హడలిపోతున్నారు. రకుల్‌ ఆందోళనకు కారణం ఇదే. మరి, తమన్నా ఏమంటుందో.! డిమాండ్‌ వుంది కాబట్టి క్యాష్‌ చేసుకోవడం మామూలేగానీ, గతంలో ఈ గాసిప్స్‌ కిక్‌ ఇచ్చేవి.. ఇప్పుడేమో, ఐటీ రెయిడ్స్‌ని ఇస్తున్నాయ్‌.. అంతే తేడా.

Show comments