దసరా బరి నుంచి ఇజమ్ ఔట్

పూరి జగన్నాధ్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమా ఇజమ్. ఈ సినిమా పూర్తయింది. టీజర్ విడుదల చేసారు. అక్టోబర్ 7 విడుదల అన్నారు. కానీ ఇంతలోనే సీన్ మారిపోయింది. సినిమా దసరా బరి నుంచి అవుట్ అయిపోయింది. అక్టోబర్ 20 కోత్త తేదీ అని అంటున్నారు. కానీ అది కూడా అనుమానమే అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. 

ఇజమ్ కు రీషూట్ లు చేస్తూ, దర్శకుడు పూరి జగన్నాధ్ కిందా మీదా పడుతున్నారని ఓ వార్త. అలాగే 26 కోట్ల భారీ బడ్జెట్ కు తగినట్లు బేరాలు రావడం లేదని మరో వార్త. ఎన్టీఆర్ తన మొహమాటంతో డిస్ట్రిబ్యూటర్లను ఫిక్స్ చేసే పనిలో వున్నారన్నది ఇంతకు ముందే బయటకు వచ్చింది. 

కొత్తగా వినిపిస్తున్నదేమిటంటే, ఎన్టీఆర్ తరువాతి సినిమా ఫిక్స్ అయితే దాన్ని అడ్డం పెట్టి, ఇజమ్ శాటిలైట్, థియేటర్ రైట్స్ వ్యవహారం ఓ కొలిక్కి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని. మరి అదే నిజమైతే ఇదంతా జరగాలంటే కొంచెం టైమ్ పడుతుంది. అలాంటపుడు సినిమా బయటకు రావాలంటే అక్టోబర్ దాటేసి మరికాస్త ముందుకు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

Show comments