నిర్మల.. బాబును పట్టించుకోలేదా!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఆమె పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీలకు అత్యంత సన్నిహితంగా మారారు. మోడీకి రకరకాల నోట్స్‌ ఆమె పంపిస్తున్నారు. దీనితో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా నిర్మలా సీతారామన్‌ పేరు తన ప్రసంగాల్లో ప్రస్తావించక తప్పడం లేదు. 

ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు ఒకవైపు, నిర్మలా సీతారామన్‌ మరోవైపు కూర్చున్నారు.ఆమెను తనవైపు రమ్మని చంద్రబాబు ఎంపీతో కబురంపించారు. నాకిక్కడే బాగుంది అని ఆమె జవాబు చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా లేచి నిర్మలా సీతారామన్‌ వద్దకు వెళ్లి తమతో పాటు కూర్చోమని అభ్యర్థించారు. 

ఐ హావ్‌ మై సీట్‌ హియర్‌.. నో ప్లాబ్లమ్‌.. యూ కారీ ఆన్‌ అని ఆమె చంద్రబాబుకు కూడా జవాబివ్వడంతో చేసేదేమి లేక చంద్రబాబు వెనుదిరిగారు. తమ ముఖ్యమంత్రి రమ్మన్నా రాలేదని, ఆమెకెంత అహంకారమని ఆయన అస్మదీయులు గుసగుసలాడుకున్నారు. 

Show comments