ఈ రాముడు బాగున్నాడా.. ఆ రాముడు బాగున్నాడా..?

దేశమంతా రాముడంటే ఒకడే. కానీ వెండితెర రాముడు మాత్రం ఒకడు కాదు. ఫ్యాన్స్ కు తగ్గట్టు మారిపోతుంటాడు. మరీ ముఖ్యంగా ఒకే సీజన్ లో రాముడిపై 2 సినిమాలొస్తే కచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడదే మొదలైంది.

రణబీర్ కపూర్ రాముడిగా రామాయణ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సీతమ్మగా సాయిపల్లవి నటిస్తోంది. తాజాగా వీళ్లిద్దరి ఆన్-లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యాయి. రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి అందులో కనిపించారు.

సరిగ్గా ఇక్కడే ఆదిపురుష్ సినిమా తెరపైకొచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన సంగతి తెలిసిందే. కాకపోతే సినిమా డిజాస్టర్ అయింది, అది వేరే సంగతి.

తాజా లీక్స్ తో ఈ ఇద్దరు రాముళ్ల మధ్య పోలిక మొదలైంది. రణబీర్-ప్రభాస్ లో రాముడిగా ఎవరు బాగున్నారు.. కృతిసనన్-సాయిపల్లవిలో సీతగా ఎవరు బాగున్నారో చెప్పమంటూ ఎవరికివాళ్లు ట్విట్టర్ లో సర్వేలు నిర్వహిస్తున్నారు.

చాలా ఫ్యాన్ గ్రూప్స్ లో వీటిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రాముడిగా ప్రభాసే బాగున్నాడంటూ, అతడి ఫ్యాన్స్ వాదిస్తున్నప్పటికీ, దీనిపై అప్పుడే ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, రణబీర్ కపూర్ నుంచి కేవలం కొన్ని స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయి. పూర్తిగా సినిమా చూసిన తర్వాత "ప్రభాస్Vsరణబీర్" సర్వే పెడితే బాగుంటుంది.

కేజీఎఫ్ స్టార్ యష్ ఇందులో రావణుడిగా కనిపించబోతున్నాడు. ఆదిపురుష్ లో సైఫ్, ఆ పాత్ర పోషించాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఈ కోణంలో కూడా కంపారిజన్ ఉంటుంది. 

Show comments

Related Stories :