అనుకున్నదే జరిగింది.. అతడు తప్పుకున్నాడు

"పవన్ కల్యాణ్ సినిమా నుంచి క్రిష్ ఔట్..?" అంటూ 2 రోజుల కిందట గ్రేట్ ఆంధ్రలో కథనం వచ్చింది. ఇప్పుడదే నిజమైంది. హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో కొత్త దర్శకుడు వచ్చి చేరాడు.

టీజర్ రిలీజ్ సందర్భంగా హరిహర వీరమల్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో దర్శకుడి పేరు లేదు. అప్పుడే చాలామందికి అనుమానం వచ్చింది. ఆ అనుమానాల్ని నిజం చేస్తూ, ఈరోజు రిలీజైన టీజర్ లో దర్శకుడి టైటిల్ కార్డు దగ్గర ఏకంగా ఇద్దరి పేర్లు వేశారు.

ఒక పేరు క్రిష్ జాగర్లమూడిది కాగా, రెండో పేరు జ్యోతికృష్ణ. హరిహర వీరమల్లు బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయబోయేది ఇతడే. అయితే లూప్ లో క్రిష్ కూడా ఉంటాడట.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్నేళ్లుగా నడుస్తోంది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా నడిచింది. అయితే నిర్మాత ఏఎం రత్నం మాత్రం సినిమాను లైమ్ లైట్లో పెట్టారు. కానీ దర్శకుడు క్రిష్ మాత్రం ఇన్నేళ్లు ఒకే ప్రాజెక్టుపై ఉండలేకపోయారు. ఆయన అనుష్కతో ఓ సినిమా చేస్తున్నాడు.

Readmore!

మళ్లీ పవన్ సెట్స్ పైకి వచ్చినప్పుడు క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ కనిపించనున్నాడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం క్రిష్ ఆధ్వర్యంలోనే నడుస్తాయంట. అందుకే టైటిల్ కార్డులో ఇద్దరి పేర్లు వేశారు.

17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2  భాగాలుగా రాబోతోంది. మొదటి భాగానికి స్వార్డ్ వెర్సెస్ స్పిరిట్ అనే పేరు పెట్టారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ కూడా తగిలించారు. రెండో భాగం మొత్తానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. 

Show comments

Related Stories :