పవన్ కు నిర్మాత నేరుగా మద్దతు

ఆంధ్ర ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ జనాలు దాదాపుగా మౌనంగా వున్నారు. మెగాస్టార్ తన సోదరుడు కనుక పవన్ వైపు అనుకూలంగా వున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పలువురు అభ్యర్ధులకు మద్దతు పలికారు. అది ఆయన వ్యక్తిగతం. తెలుగుదేశంతో అనుబంధం వున్న వాళ్లు కూడా నేరుగా మాట్లాడడం లేదు.

దాదాపు ఇండస్ట్రీలో వున్న చాలా అంటే చాలా మందికి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని వుంది. కానీ ఆ మాట కూడా ఓపెన్ గా చెప్పడం లేదు. తెరవెనుక నుంచి విరాళాలు అందిస్తున్నారు. మౌనంగా వున్నారు.

ఇలాంటి టైమ్ లో సితార సంస్థ నిర్మాత నాగ వంశీ మాత్రం పవన్ కళ్యాణ్ కు నేరుగా మద్దతు ప్రకటించడమే కాదు, ఆంధ్ర జనాలు అంతా ఎన్నికల టైమ్ కు వెళ్లి, ఓటు వేయడం ద్వారా పవన్ కు సేవ చేయాలని పిలుపు ఇచ్చారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫంక్షన్ లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగవంశీ సమాధానం ఇస్తూ, పవన్ తో సాన్నిహిత్యం వుందని మీరే అంటున్నారు, మళ్లీ వేరుగా మద్దతు వుంటుందా అది అడగడం ఎందుకున్నారు. ఆపై అక్కడితో ఆగకుండా ఆంధ్ర జనాలు అంతా వెళ్లి ఓటు వేయడమే పవన్ కు చేసే సేవ అని కామెంట్ చేసారు.

టాలీవుడ్ లో, మెగా బంధాలు లేకుండా, ఇలా నేరుగా పవన్ కు మద్దతు పలికిన తొలి నిర్మాత నాగవంశీనే.

Show comments

Related Stories :