రూ.100 కోట్ల సినిమా తర్వాత సందీప్ తో మూవీ!

గీతగోవిందం లాంటి సినిమా ఇచ్చిన తర్వాత దర్శకుడు పరశురామ్ కెరీర్ గ్రాఫ్ ఎలా మారిందో అందరం చూశాం. అంతకుమించిన సినిమాను ఇచ్చాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. కానీ ఇతడి కెరీర్ గ్రాఫ్ మాత్రం ఊపందుకోలేదు.

ధమాకా సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నక్కిన. ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఆ సక్సెస్ ను మాత్రం ఈ దర్శకుడు క్యాష్ చేసుకోలేకపోయాడు. మూవీ వచ్చి రెండేళ్లవుతున్నా, ఇప్పటివరకు మరో పెద్ద సినిమా లాక్ చేసుకోలేకపోయాడు.

దర్శకుడిగా రెండేళ్ల విరామం తర్వాత, ఇప్పుడు సందీప్ కిషన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. త్రినాధరావు-సందీప్ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు క్లాప్ కొట్టారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.

దర్శకుడిగా పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులు వేశాడు త్రినాధరావు. ఆల్రెడీ ఓ ప్రాజెక్టును సెట్స్ పైకి తెచ్చారు. మరో సినిమా ప్రకటించారు. అందుకే దర్శకుడిగా కెరీర్ లో గ్యాప్ తప్పలేదు. ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Show comments

Related Stories :