రామోజీని కూడా వాడేసుకున్న చంద్రబాబు!

దేశంలో డెవలప్ అయిన రోడ్లను, డెవలప్ అయిన టెక్నాలజీని, డెవలప్ అయిన ప్రతి రంగాన్ని, కట్టిన భవంతులను, అవార్డులను పొందిన వ్యక్తులను, ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను.. తన గొప్పదనానికి నిర్వచనాలు అని చెప్పుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆయన దినచర్యే అది.

ఈ క్రమంలో రాజగురువు రామోజీ రావును కూడా చంద్రబాబు వాడేసుకున్నారు. ఇది వరకూ అంబేద్కర్ కు భారతరత్నను ఇప్పించింది నేనే, అబ్దుల్‌ కలాం ను రాష్ట్రపతిగా చేసింది నేనే.. అంటూ చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు.. రామోజీకి పద్మ అవార్డును ఇప్పించింది కూడా నేనే.. అనేశాడు!

రామోజీ దత్తత తీసుకున్న గ్రామంలో బాగా డెవలప్ మెంట్ జరిగిందట.. ఈ విషయాన్ని రామోజీ మీడియా ఏ కరువు పెడుతుండగా.. ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఆ గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రామోజీరావుకు పద్మవిభూషన్ ఇప్పించింది నేనే.. అని చెప్పేసుకున్నారు. మరి మొన్నటి వరకూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అంతా అనుకున్నారు.

భారతీయ జనతా పార్టీకి ఈనాడు మీడియా ద్వారా రామోజీరావు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని.. ఈ అవార్డును ఇచ్చిందని కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే అవన్నీ కాదు.. రామోజీ రావుకు అవార్డును ఇప్పించింది నేనే.. అని చంద్రబాబు చెప్పేసుకున్నారు. మొత్తానికి తన గొప్పదనాన్ని చెప్పుకోవడానికి చంద్రబాబు రామోజీని కూడా వద్దల్లేదని స్పష్టం అవుతోంది.

Show comments