రామోజీ రావుకి అస్వస్థత

‘ఈనాడు’ అధిపతి రామోజీ రావు(80) అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. సోమాజీగూడలోని యశోదాలో రామోజీ చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. సోమవారం ఆయన అడ్మిట్ అయ్యారు.. సీనియర్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ఆహారం కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు డిశ్చార్జి అవుతారనే అంశం గురించి సమాచారం లేదు. రామోజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు వాకబు చేస్తున్నారు. 

Show comments