హడావుడి అంతా వెంకీదేనంట

చైతూ-సమంతల పెళ్లి ఎంగేజ్ మెంట్ ఫొటోలు అయితే బయటకు వచ్చాయి కానీ, హడావుడి ఏ రేంజ్ లో జరిగింది అన్నది అంతగా బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఒక్కోటి తెలుస్తున్నాయి.

జస్ట్ 140 మందిని మాత్రమే ఈ ఈవెంట్ కు ఆహ్వానించారట. అయితే అందరూ అనుకున్నట్లు ఈ ఈవెంట్ ఆహ్వానితుల జాబితా రూపొందించింది నాగ్ కాదట. పెళ్లి కొడుకు నాగ్ చైతన్యనే నంట.

ఈ నూట నలభై మందిలో సినిమా వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చట. డైరక్టర్లు విక్రమ్ కుమార్, కళ్యాణ్ కృష్ణ, చందు మొండేటి. బాహుబలి నిర్మాత, నాగ్ సన్నిహితుడు రాఘవేంద్రరావు బంధువు అయిన ప్రసాద్ దేవినేని, మాట్రిక్స్ ప్రసాద్ మాత్రమే సినిమాలతో కాస్త లింక్ వున్నవారు.

సమంత తరపున 14 మంది హాజరయ్యారట. ఇక చైతన్య తల్లి తరపున చెన్నయ్ నుంచి కొంతమంది హాజరయ్యారట. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అందరూ హాజరయ్యారట. ఇక అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్.

అయితే ఈ ఫంక్షన్ లో ఆద్యంతం చైతన్య మేనమామ వెంకటేష్ నే హల్ చల్ చేసారట. వచ్చిన వాళ్లను ఆహ్వానించడం, వాళ్లతో సరదాలు, డ్యాన్స్ లు, ఇలా ఒకటేమిటి వెంకీ అదరకొట్టాడట తన హడావుడితో. నాగార్జున సన్నిహితుడు, దర్శకుడ రాఘవేంద్రరావు మాత్రం ఈ ఈవెంట్ కు హాజరుకాలేదు. మరి ఏం బిజీలో వుండిపోయారో?

Show comments