సాహో బాహుబలి... వెయ్యికి పైగా స్క్రీన్స్ పై 50 రోజులు

రోజుకో రికార్డుతో దూసుకుపోతున్న బాహుబలి-2 కళ్లముందే 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1076 తెరలపై నేటితో 50-డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది.

భారత్ లో 1051 స్క్రీన్స్ పై ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది బాహుబలి-2. అటు ఓవర్సీస్ లో ఏకంగా 25 స్క్రీన్స్ పై “ది కంక్లూజన్” కొనసాగుతోంది. ఓవర్సీస్ లో వారం రోజులు ఆడడమే ఎక్కువ. అలాంటిది 25 స్క్రీన్స్ పై 50 రోజులు పూర్తిచేసుకుంది బాహుబలి-2.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 282 స్క్రీన్స్ పై బాహుబలి-2 చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో 120, కేరళలో 102, కర్నాటకలో 58 తెరలపై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది ఈ సినిమా.

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు మల్లూవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి – ది కంక్లూజన్ సినిమా నిలిచింది.

త్వరలోనే ఈ సినిమాను చైనాతో పాటు మరికొన్ని యూరోప్ దేశాల్లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.

Show comments