పూనమ్ కౌర్.. పవన్ పై సెటైర్! ఆ వ్యక్తి ఎవరు?


'రెండు బెత్తం దెబ్బలు ప్లీజ్..' అంటూ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై ఒక హీరోయిన్ సెటైర్ వేసింది. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు.. అంటూ జనసేన అధినేత చేసిన తీర్మానాన్ని ఆమె దెప్పి పొడిచింది. దిశ రేపిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని స్వాగతిస్తూ పూనమ్ కౌర్ ఆ ట్వీట్ చేసింది.

'దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇలాగే నాతో పాటు మరికొందరు మహిళలను మోసం చేసిన సినీ అలియాస్  రాజకీయ నేతలను శిక్షిస్తారని భావిస్తున్నాను.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. 

ఆ  తర్వాత కొద్ది సేపటికి ఆమె ట్వీట్ ను  తొలగించినట్టుగా తెలుస్తోంది. తొలగించడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో కానీ.. ఆమె ట్వీట్లో పవన్ కల్యాణ్ ఇన్ డైరెక్ట్ ప్రస్తావన స్పష్టం అవుతూ ఉంది. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు వేయాలని ఇటీవలే పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అది పవన్ కల్యాణ్ ప్రస్తావన. ఈ ట్వీట్లో మరో ప్రస్తావన కూడా ఉంది.

సినీ అలియాస్ రాజకీయ నేత అంటూ పూనమ్ ప్రస్తావించింది.  తనతో పాటు మరికొందరు మహిళలను ఆ వ్యక్తి మోసం చేశారని పూనమ్ పేర్కొంది. అతడి మీదా చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేసింది. నర్మగర్భంగా ఉన్న ఈ ట్వీట్ ఎవరికి తగులుతోందో స్పష్టంగానే ఉంది. అలాంటి వాళ్లే రోడ్డెక్కి ఇప్పుడు నీతులు చెబుతూ ఉన్నారు. 

Show comments